Hyderabad: పోలీస్స్టేషన్ల పేరు మార్పు..
ABN , Publish Date - May 01 , 2025 | 08:13 AM
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా వివిధ పోలీస్స్టేషన్ల పేర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

- ప్రతీజోన్లో సైబర్ క్రైం సెల్ ఏర్పాటు
- మహిళల భద్రతకు ప్రత్యేక యూనిట్లు
- హైదరాబాద్ కమిషనరేట్ పునఃవ్యవస్థీకరణ
- ఆదేశాలు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ కమిషనరేట్ పునఃవ్యవస్థీకరణకు సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పలు పోలీస్స్టేషన్ల పేర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా కమిషనరేట్కు మంజూరైన 17వేల మంది సిబ్బందిని అంతర్గత సర్దుబాటు, పలు మార్పులను సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను హోంశాఖ ఈ నెల 24న ఆమోదిస్తూ జీఓ 57ను జారీ చేసింది. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్లోని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Inspectors: 146 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
మార్పులు ఇలా..
నగరంలోని పలు డివిజన్లు, పోలీస్టేషన్ల పేర్లను మార్చారు. గోల్కొండ డివిజన్ను టౌలిచౌకిగా, సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ను లేక్ పోలీస్ స్టేషన్గా, షాహినాత్గంజ్ పోలీస్ స్టేషన్ను గోషామహల్గా మార్చారు. పలు ట్రాఫిక్ పోలీస్టేషన్ల పేర్లను కూడా మార్చారు. మారేడ్పల్లి, బోయినపల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్టేషన్లను తీసివేశారు. నాంపల్లి, అంబర్పేట, లంగర్హౌస్(Nampally, Amberpet, Langar House), బహదూర్పురా, నల్లకుంట ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను గాంధీనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, కుల్సుంపుర, ఛత్రినాక, సైదాబాద్ ట్రాఫిక్ పోలీస్టేషన్లుగా మార్చారు.
సైబర్ క్రైం సెల్
పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతీ లా అండ్ ఆర్డర్ జోన్లో ఒక సైబర్ క్రైం సెల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సెల్లో ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. మహిళా భద్రత, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను అనుసంధానం చేసి అదనపు సిబ్బందిని నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్కు బానిసలు
Read Latest Telangana News and National News