Junior Colleges: ప్రభుత్వ కాలేజీల్లో నత్తనడకన ఇంటర్ అడ్మిషన్లు!
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:48 AM
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. 197 కాలేజీల్లో 100లోపు, 46 కాలేజీల్లో కేవలం 50లోపు అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి.
మహబూబ్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాత్రమే 1030 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. ఆ తర్వాత 877 ప్రవేశాలతో నాంపల్లిలోని ఎంఎఎం మహిళా మోడల్ జూనియర్ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచింది. 824 అడ్మిషన్లతో హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ తృతీయస్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 16 కాలేజీల్లో మాత్రమే 500కంటే ఎక్కువ అడ్మిషన్లు జరిగాయి.