K Keshav Rao: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను బాధించాయని తెలుసు!
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:59 AM
ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించాయని నాకు తెలుసు..

ప్రజాస్వామ్యంలో మనమంతా జవాబుదారీగా ఉండాలి: కేకే
మెదక్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ‘ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించాయని నాకు తెలుసు.. అయితే ప్రజాస్వామ్య పాలనలో పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందుకనే సీఎం అంత ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.
ఏదేమైనా ఉద్యోగులు కోరుతున్న డిమాండ్లలో సగానికి పైగా త్వరలోనే సీఎం నెరవేరుస్తారని సమాచారం ఉంది’ అని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వ్యాఖ్యానించారు. మెదక్లోని కలెక్టరేట్లో ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా కేకే హాజరై ప్రసంగించారు. దేశంలోని సీనియర్ రాజకీయవేత్తల్లో తానొకరినని.. తమ చేతుల మీదుగా తెలంగాణ ఆవిర్భవించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News