Share News

Khammam: వంట గ్యాస్‌ లీకై.. అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:11 AM

వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

Khammam: వంట గ్యాస్‌ లీకై.. అగ్ని ప్రమాదం

  • ఒకే కుటుంబంలో బాలుడు, వృద్ధురాలి మృతి

తల్లాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. తాపీ వర్కర్‌ గుత్తికొండ వినోద్‌ కుమార్‌ ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ ఖాళీ అవడంతో నిండుగా ఉన్న మరో సిలిండర్‌ను స్టవ్‌కు పెట్టారు. ఈ క్రమంలో సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై ఇంటి ఆవరణలో వ్యాపించింది. అదే సమయంలో ఇంటి ముందు కట్టెల పొయ్యి మండుతూ ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగింది.


దీంతో ఇంట్లో ఉన్న వినోద్‌కుమార్‌తో పాటు అతడి నాయనమ్మ గుత్తికొండ సుశీల(70), ఏడేళ్ల వయసున్న కుమారులు(కవలలు) తరుణ్‌, వరుణ్‌.. మేనకోడళ్లు గుంట్రు ప్రిన్సీ(9), గుంట్రు లిమ్సీ(5) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుశీల, హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడు తరుణ్‌(7) మృతిచెందారు. వరుణ్‌, లిమ్సీ, ప్రిన్సీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ప్రమాద సమయంలో వినోద్‌ కుమార్‌ భార్య రేవతి దుకాణానికి వెళ్లడంతో ఆమెకు ముప్పు తప్పింది. వేసవి సెలవులు కావడంతో సరదాగా గడుపుదామని మేనమామ వినోద్‌ ఇంటికి వచ్చి అక్కా చెల్లెళ్లు ప్రిన్సీ, లిమ్సీ ప్రమాదానికి గురయ్యారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:11 AM