Share News

Nampally: 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:42 AM

మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి 5 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు.

Nampally: 8,9 తేదీల్లో చేప  ప్రసాదం పంపిణీ

  • ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు

  • 1.50 లక్షల చేప పిల్లలు సిద్ధం

  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌/ గోషామహల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి 5 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు. రోగుల కోసం మొత్తం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అంధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఉబ్బసం రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం తాత్కాలిక విశ్రాంతి షెడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేప మందు కోసం 2 తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, హరియాణ, ఢిల్లీ రాష్ట్రాల నుంచి రోగులు రానున్నారు. ఇప్పటికే వచ్చిన రోగులు, వారి సహాయకులు తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు.


ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చేప ప్రసాదం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు, చేప మందు పంపిణీకి 1.50 లక్షల చేపపిల్లలను రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ అందుబాటులో ఉంచింది. ఎవరికి ఆరోగ్య సమస్య తలెత్తినా మెరుగైన చికిత్స కోసం మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోగుల వాహనాల పార్కింగ్‌కు 10 చోట్ల స్థలాలు కేటాయించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకూ వేల మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం/ రాత్రి భోజన వసతి కోసం ప్రత్యేక స్టాళ్లను పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి.


క్యాబినెట్‌లో మా సమస్యలపై చర్చించండి

  • మంత్రి పొన్నంకు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, విద్యుత్‌ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం, వెల్ఫేర్‌ కమిటీల రద్దు తదితర అంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించాలని కోరారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 02:42 AM