Share News

ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంతే!

ABN , Publish Date - May 09 , 2025 | 03:56 AM

బీజేపీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని నాడు నర్సరీ స్కూల్‌లో చేర్పించింది ఎవరో తెలుసా అది 30 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలో యువ నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంతే!

  • అప్పట్లో ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌

  • ఆసక్తికర ఘట్టాలతో బండారు దత్తాత్రేయ ఆత్మకథ

  • నేడు ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌

న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): బీజేపీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని నాడు నర్సరీ స్కూల్‌లో చేర్పించింది ఎవరో తెలుసా? అది 30 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలో యువ నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయాన్ని దత్తాత్రేయ తన ఆత్మకథలో వెల్లడించారు. ఆయన రచించిన ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకాన్ని శుక్రవారం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆవిష్కరించనున్నారు. 1947 జూన్‌ 12న జన్మించిన దత్తాత్రేయ తన జీవితంలోని అత్యంత కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారు. గౌలిగూడలోని మహారాజ్‌గంజ్‌లోని గుడంబ బస్తీగా పేరుపొందిన ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయ తండ్రితో పాటు ఉస్మాన్‌గంజ్‌లో ఉల్లిపాయలు అమ్మేందుకు వెళ్లేవారన్న విషయం చాలామందికి తెలియదు. అదే బస్తీలో అనేకమంది పేదలతో పాటు ప్రభుత్వ మరుగుదొడ్డిలో కాలకృత్యాలు తీర్చేకునేవారు. ఐదో ఏటే తండ్రిని కోల్పోయిన దత్తాత్రేయ జీవితం లో ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును వీడకుండా గ్రాడ్యుయేషన్‌ వరకు చదివారు.


దత్తాత్రేయ పదో తరగతి చదువుతున్నప్పుడు 1963లో మనోహర్‌ షిండే అన్న ప్రచారక్‌ ఆర్‌ఎస్‌ఎ్‌సలో చేర్పించారు. దాంతో దత్తాత్రేయ జీవితమే మారిపోయింది. 1968లో తానే ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయ... 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత ఏపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కావడంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. గోల్వాల్కర్‌, దేవరసు, రాజేందర్‌ సింగ్‌, సుదర్శన్‌ నుంచి మోహన్‌భగవత్‌ వరకు మొత్తం ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేతలందరూ దత్తాత్రేయను అభిమానించారు. 1977లో దివిసీమ ఉప్పెనలో సంఘ్‌ తరపున దత్తాత్రేయ నిర్వర్తించిన సేవా కార్యక్రమా లు ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. తన జీవితంలో సగభాగం సంఘ్‌కే కేటాయిచిన దత్తాత్రేయ 42వ ఏట 1989లో వివాహం చేసుకున్నారు. స్వాతంత్య్ర అనంతర దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘట్టాలను దత్తాత్రేయ తన ఆత్మకథలో వివరించారు. ఎన్టీఆర్‌పై జరిగిన తిరుగుబాటును ఆసక్తికరంగా వివరించిన దత్తాత్రేయ 1946-47 ప్రాంతంలో ఎన్టీఆర్‌ స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం ఎన్టీఆర్‌ తనకు చెప్పారని, స్వామి వివేకానంద తనకు స్ఫూర్తి అని వెల్లడించారని దత్తన్న తన ఆత్మకథలో వెల్లడించారు. అన్ని రాజకీయపార్టీల నేతల అభిమానాన్ని చూరగొన్న దత్తన్న... నక్సలైట్‌ నాయకుడైన మధుసూదన్‌రాజ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పుడు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:56 AM