Congress: ఆ విలీనం జరగకుంటే బీజేపీని నిషేధిస్తారా?
ABN , Publish Date - May 15 , 2025 | 03:46 AM
కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కానున్నట్లు నీకు ఎవరు చెప్పారు నువ్వు చెప్పినట్లుగా జూన్ 2న లేదా.. డిసెంబరు నెలలో విలీనం కాకుంటే..

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు అద్దంకి దయాకర్ సూటి ప్రశ్న
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కానున్నట్లు నీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినట్లుగా జూన్ 2న లేదా.. డిసెంబరు నెలలో విలీనం కాకుంటే.. తెలంగాణలో బీజేపీని నిషేధిస్తారా?’’ అంటూ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్లు దిట్టలు అన్నారు. గాంధీభవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసలు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్లలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరి వర్గమో చెప్పాలన్నారు.
గతంలోనూ ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ ఈ విధంగానే కారుకూతలు కూస్తే ఏమైందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని, కమలం కాడకు గులాబీ పువ్వును అంటు కట్టారన్నారు. వచ్చే టర్మ్లోనూ రేవంత్రెడ్డే సీఎం కానున్నారన్న సంగతిపై బీజేపీ నేతలకు స్పష్టత ఉందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.