Harish Rao: దశ దిశ లేకుండా కాంగ్రెస్ పాలన
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:42 AM
కాంగ్రెస్ పాలన దశ, దిశ లేకుండా సాగుతోందని హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వైఫల్యం చూపించిందని ఆయన పేర్కొన్నారు, మరియు బీఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు

మాయమాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు
బీఆర్ఎస్.. ప్రజల కోసం పుట్టిన పార్టీ: హరీశ్ రావు
ఎల్కతుర్తి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఒక దశ, దిశ లేకుండా కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఎవరికివారే మాయమాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 14ఏళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా, ఎడాదిన్నర కాలంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని, మున్ముందు కూడా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏటా 12 శాతానికి పెంచి వచ్చిన సంపదను పేదలకు పంచిందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వ వైఫల్యం వల్ల సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలన వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా పథకాలకు కేసీఆర్ చాంపియన్గా నిలిచారని కొనియాడారు. సమ్మక్క-సారలమ్మ ఎత్తిపోతల ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజులు ఆలస్యంగా దేవాదుల మోటర్లను ప్రారంభించడంతో సకాలంలో సాగునీరు అందక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆయన మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News