CM Revanth Reddy: ఆర్ఆర్ఆర్పై ముఖ్యమంత్రి సమీక్ష
ABN , Publish Date - May 31 , 2025 | 05:02 AM
రీజీనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ విధానం (హ్యామ్)లో అభివృద్ధి చేయబోయే రోడ్లు, హైదరాబాద్-మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ రహదారులపైనా చర్చించారు.

దక్షిణ భాగం అలైన్మెంట్ పరిశీలన
హ్యామ్ రోడ్లు, హైదరాబాద్-మంచిర్యాల
గ్రీన్ఫీల్డ్ రహదారులపైనా ఆరా
అధికారులకు పలు సూచనలు చేసిన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): రీజీనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ విధానం (హ్యామ్)లో అభివృద్ధి చేయబోయే రోడ్లు, హైదరాబాద్-మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ రహదారులపైనా చర్చించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రోడ్డు మొదలయ్యే చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న అలైన్మెంట్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. మార్గమధ్యంలో ఉన్న భూములు, నీటి వనరుల వివరాలు తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు పరిధిలో రాబోయే మార్గంపై పలు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. అదే విధంగా హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయతలపెట్టిన పలు రోడ్ల గురించి కూడా ఆరా తీశారు. ఆర్అండ్బీ పరిధిలో హ్యామ్ కింద మొదటి దశలో 5,190 కి.మీ. మేర రోడ్లను నిర్మించాలని గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
మొదటి దశలో గ్రామ, మండల, జిల్లా అనుసంధాన రోడ్లు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా తెలిపారు. హ్యామ్ రోడ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు రూపొందించిన మూడు ప్రతిపాదనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడి నుంచి రహదారిని నిర్మించేందుకు అవకాశం ఉందనేదానిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ మార్గంపైనా పలు సూచనలు చేశారు. కాగా, ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షి్ప పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన అగసర నందినికి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్