Kaleshwaram Barrage: 2న ఎన్డీఎస్ఏ నివేదికపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:29 AM
కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) అందించిన నివేదికపై మే 2న అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.

అదే రోజు 224 మంది ఏఈలకు నియామక పత్రాలు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) అందించిన నివేదికపై మే 2న అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఐదురోజుల కిందట కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎ్సఏ నివేదిక అందించిన విషయం విదితమే. మే 2న సాయంత్రం జలసౌధలో జరిగే కార్యక్రమంలో నీటిపారుదలశాఖలో కొత్తగా ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారుల(జేటీవో)కు ముఖ్యమంత్రి నియామకపత్రాలు అందించనున్నారు.
అనంతరం నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం దిశగా ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News