CM Revanth Reddy: ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్
ABN , Publish Date - May 12 , 2025 | 04:41 AM
భారత ఉక్కు మహిళ.. అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో దేశ సైనికాధికారులతో ఉన్న పాత ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

భారత ఉక్కు మహిళ అంటూ ‘ఎక్స్’లో పాత ఫొటోతో పోస్టు
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): భారత ఉక్కు మహిళ.. అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో దేశ సైనికాధికారులతో ఉన్న పాత ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం, కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గతంలో ఇవే పరిస్థితుల్లో ఇందిరా గాంధీ వ్యవహరించిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు.
కాగా, పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా కొద్దిరోజుల కింద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలోనూ ఇందిరాగాంధీని దుర్గామాతగా అప్పటి ప్రతిపక్ష నేత వాజ్పేయి అభివర్ణించారన్న విషయాన్ని సీఎం ప్రస్తావించిన సంగతి తెలిసిందే..
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News