Diabetes Awareness: పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించండి
ABN , Publish Date - May 18 , 2025 | 04:15 AM
మధుమేహంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని సీబీఎ్సఈ నిర్ణయించింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన టైప్-2 డయాబెటెస్ ఇప్పుడు పిల్లల్లోనూ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

పాఠశాలల్లో ‘షుగర్ బోర్డులు’ పెట్టండి
ప్రిన్సిపాళ్లకు సీబీఎ్సఈ ఆదేశాలు
మధుమేహంపై చిన్నతనం నుంచే అవగాహన
న్యూఢిల్లీ, మే 1: మధుమేహంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని సీబీఎ్సఈ నిర్ణయించింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన టైప్-2 డయాబెటెస్ ఇప్పుడు పిల్లల్లోనూ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పాఠశాల స్థాయి నుంచే అప్రమత్తత పాటించేలా చర్యలు తీసుకోనుంది. విద్యార్థులు పరిమితికి మించి స్వీట్లు, చక్కెర పదార్థాలు తినకుండా, శీతల పానీయాలు తాగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పాఠశాలలకు సూచించింది.
పాఠశాలల్లో సుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏ తినుబండారంలో చక్కెర ఎంత శాతం ఉందో రాయాలని సూచిస్తూ అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు లేఖలు రాసింది. 4 నుంచి 10 ఏళ్లలోపు విద్యార్థులు తినే ఆహారంలో 13 శాతం చక్కెర ఉంటోంది. 11-18 ఏళ్ల పిల్లల్లో ఇది 15 శాతంగా ఉంది. అనుమతించిన పరిమితి కన్నా ఇది 5 శాతం అధికం. అందువల్ల ఏ తినుబండారంలో ఎంత చక్కెర ఉందో, అధికంగా తింటే ఎలాంటి ముప్పు ఉంటుందో బోర్డులపై రాయాలని తెలిపింది. ఈ ఆదేశాల అమలుపై జులై 15లోగా సంక్షిప్తంగా నివేదిక, ఫొటోలు పంపాలని సూచించింది
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News