Hyderabad: హైదరాబాద్కు వ్యాపారవేత్త అదానీ
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:04 AM
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్ అదానీతో కలిసి ఆయన హాజరయ్యారు.

‘ప్రతిమ’ చైర్మన్ శ్రీనివాసరావు ఇంట్లో తేనీటి విందుకు హాజరు
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్ అదానీతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అదానీని ప్రతిమ గ్రూప్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు (ప్రతిమ శ్రీనివాసరావు) ఆహ్వానించడంతో ఆయన ఇంటికెళ్లారు.. అక్కడ శ్రీనివాసరావు ఇచ్చిన తేనీటి విందును అదానీ స్వీకరించారు. అంతకుముందు ప్రతిమ శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి, హాసినీలు అదానీకి స్వాగతం పలికారు.