Share News

BRS: బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అవతరణ వేడుకలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:56 AM

రాష్ట్ర అవతరణ వేడుకలను బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

BRS: బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అవతరణ వేడుకలు

  • ఆరోగ్యం సహకరించక.. హాజరు కాని కేసీఆర్‌

  • నేడు లేదా రేపు ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి!

హైదరాబాద్‌/సంగారెడ్డి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ వేడుకలను బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావుతో కలిసి మండలి విపక్షనేతమధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీకార్యాలయం ఆవరణలోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ ఫామ్‌హౌ్‌సకే పరిమితమయ్యారు.


ఆదివారం షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విశ్రాంతి తీసుకుంటున్నందునే.. తెలంగాణ అవతరణ వేడుకలకు హాజరు కాలేదని తెలిసింది. మంగళవారం లేదా బుధవారం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడమా లేక ఫామ్‌హౌ్‌సకే వైద్యులు రప్పించి పరీక్షలు చేయించుకోవాలా అనే విషయమై ఆయన తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ సతీమణి శోభ, మనవడు హిమాన్షు సోమవారం ఫాంహౌ్‌సకు వచ్చినట్లు సమాచారం.

Updated Date - Jun 03 , 2025 | 03:56 AM