BJP: మెట్రోరైల్ను కీసర ఓఆర్ఆర్ వరకు విస్తరించాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 09:36 AM
మెట్రోరైల్ను తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈమేురకు మెట్రో విస్తరణ కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- ఎంపీకి బీజేపీ నాయకుల వినతి
సికింద్రాబాద్: తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో రైల్ను విస్తరించాలని కోరుతూ కాప్రా సర్కిల్ బీజేపీ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender)ను కలిసి వినతిపత్రం అందజేశారు. శివారు మండలాలు, గ్రామాలకు చెందిన వేలాది మంది ఈసీఐఎల్ చౌరస్తా, తార్నాక మీదుగా జంట నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారని,
ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు మెట్రో రైలు ఒక్కటే పరిష్కారమని వారు ఎంపీకి విన్నవించుకున్నారు. ఎంపీనిన కలిసిన వారిలో బీజేపీ నాయకులు ఎం. గణేష్ ముదిరాజ్, డి. నాదం, ఎం.లక్ష్మణ్ గౌడ్, తాళ్ల ఆనంద్ గౌడ్, విద్యాసాగర్, అప్పినాయీ, బొల్ల శ్రీనివాస్, రత్తపురం వెంకటేష్, పి.రాజు, రామకృష్ణ, జహంగీర్, సాయికిరణ్ తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం
Read Latest Telangana News and National News