కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యం
ABN , Publish Date - May 15 , 2025 | 03:43 AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీని కాంగ్రె్సలో విలీనం చేయబోతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు.

జూన్ 2 లేదా డిసెంబరు 9లోగా: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూన్ 2 తర్వాత లేదా డిసెంబరు 9లోగా విలీనం తథ్యమని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరి, కేసీఆర్ నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విలీనం చేయబోతున్నారని చెప్పారు.
కాంగ్రె స్కు చెందిన ప్రముఖ న్యాయవాదిని రాజ్యసభకు పంపడం, ఇరు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై వివిధ కేసుల్లో విచారణ మందకొడిగా జరుగుతోందని ఆరోపించారు. సీఎం మార్పు కూడా జరగనుందని జోస్యం చెప్పారు.