Banakacherla Project: బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:13 AM
బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మండిపడ్డారు.

హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ విధంగా నష్టమో వారు సమాధానం చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
సముద్రంలో కలిసిపోతున్న నీటిని వాడుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎదగకుండా జరుగుతున్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎ్సలు దుష్ప్రచారం చేస్తున్నాయని బక్కని ఆగ్రహం వ్యక్తం చేశారు.