Share News

Asaduddin Owaisi: వారిద్దరూ తెలివి తక్కువ జోకర్లే..

ABN , Publish Date - May 28 , 2025 | 07:34 AM

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తెలివి తక్కువ జోకర్లు అని వ్యాఖ్యానించారు. ఈ జోకర్లు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Asaduddin Owaisi: వారిద్దరూ తెలివి తక్కువ జోకర్లే..

- పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లు తెలివి తక్కువ జోకర్లు

- కువైట్‌లో మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలు

- భారత్‌పై విజయం సాధించామని తప్పుడు ప్రచారాలు

హైదరాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తెలివి తక్కువ జోకర్లని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ కుటిల నీతి, కుట్రలను ఎండగట్టేందుకు భారత ఎంపీ ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం కువైట్‌లో పర్యటిస్తున్న బృందంలో ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కువైట్‌లోని భారతీయ సంతతి పౌరులనుద్దేశించి ఒవైసీ మాట్లాడారు.


city2.2.jpg

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతిగా తాము ‘ఆపరేషన్‌ బున్యాన్‌-ఉన్‌-మర్సూస్‌’ నిర్వహించి విజయం సాధించామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేయడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. ఈ జోకర్లు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్‌ ఫొటోను చూపుతూ భారత్‌పై విజయమని చెప్పుకుంటున్నారని ఒవైసీ విమర్శించారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు

Read Latest Telangana News and National News

Updated Date - May 28 , 2025 | 07:34 AM