Nagarjuna Sagar: సాగర్కు యజమాని తెలంగాణే
ABN , Publish Date - May 01 , 2025 | 04:38 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తెలంగాణయే యజమాని అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) చైౖర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు.

స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ చైౖర్మన్ అనిల్ జైన్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తెలంగాణయే యజమాని అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) చైౖర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. (డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్-ధర్మ వెబ్సైట్) అదే పేర్కొంటోందని తెలిపారు. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్కు యజమాని ఎవరో తేల్చాలని అనిల్ జైన్ను తెలంగాణ కోరగా.. ఆయన పై విధంగా స్పందించారు. బుధవారం వాలంతరిలో తెలంగాణ అధికారులతో అనిల్ జైన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా.. తెలంగాణ ఏర్పడ్డాక నాగార్జునసాగర్ డ్యామ్ తాత్కాలిక నిర్వహణ తమ చేతిలో ఉండగా... శ్రీశైలం ఏపీ చేతిలో ఉందని, 2023 నవంబరులో ఏపీ ప్రభుత్వం భారీ పోలీసు బలగాలతో సాగర్ డ్యామ్ కుడివైపు భాగాన్ని ఆక్రమించుకుందని తెలంగాణ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి డ్యామ్/బ్యారేజీకి ప్రత్యేక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) మ్యానువల్ సిద్ధం చేయాలని అనిల్ జైన్ నిర్దేశించారు. సాగర్ కట్టపై ఏపీ ఆక్రమణను తొలగించి, మరమ్మతుల కోసం తగిన చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ కోరారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..