డీడీ కట్టినా.. శ్రీవారి సేవకు నో!
ABN , Publish Date - May 19 , 2025 | 04:48 AM
తిరుమల వేంకటేశ్వర స్వామి సేవ కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు చివరకు విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు కోర్టులో పోరాడి సేవా టికెట్ల ను పొందారు.

వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించిన దంపతులు
కమిషన్ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ అధికారులు
దంపతులకు తిరుప్పావడ సేవా టికెట్ల అందజేత
మహబూబ్నగర్ టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామి సేవ కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు చివరకు విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు కోర్టులో పోరాడి సేవా టికెట్ల ను పొందారు. మహబూబ్నగర్కు చెందిన వ్యాపారవేత్త శెట్టి చంద్రశేఖర్ దంపతులు, కుటుంబ సభ్యులు తిరుమల వేంకటేశ్వరస్వామికి తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనేందు కు 2008 నవంబరు 26న డీడీ రూపంలో రూ. 21,250 చెల్లించారు. కానీ ఏళ్లు గడిచినా వారికి అవకాశం దక్కలేదు. దీంతో వారు టీటీడీకి అనేక లేఖలు రాయగా, 2021, సెప్టెంబరు 10న సేవల్లో పాల్గొనేందుకు స్లాట్ బుక్ అయింది. కానీ, కరోనా కారణంగా ఆ సేవలు రద్దు చేశామని, వాటి స్థానంలో బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ సమాచారం అందించింది. దీంతో వారు న్యాయం కోసం మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు.
4 రోజుల్గోగా తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.20 లక్షలు జరిమానా చెల్లించాలని కమిషన్ న్యాయాధికారి ఎం. అనురాధ గతేడాది మే 8న తీర్పు నిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీటీడీ.. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది. వివాదాన్ని అక్కడే పరిష్కరించుకోవాలని వారు జిల్లా కోర్టుకు తిప్పి పంపించారు. ఈనెల 15న కమిషన్ విచారించి.. తాము ఇచ్చిన తీర్పుకు కట్టుబడి భక్తులకు తిరుప్పావడ, మేల్చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారా? లేక జరిమానా చెల్లిస్తారా? లేదా జైలుకు వెళ్తారా? అని కమిషన్ న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన టీటీడీ అధికారులు.. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ, సేవా టికెట్లను కోర్టు ద్వారా వారికి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News