Nitin Gadkari: భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది..
ABN , Publish Date - May 05 , 2025 | 12:44 PM
Central Minister Nitin Gadkari: చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

కొమురం భీం జిల్లా: తెలంగాణ (Telangana)లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) పర్యటిస్తున్నారు (Visit). కొమురం భీం జిల్లా (Komaram Bheem Dist.)లోని కాగజ్నగర్ (Kagaznagar)లో రూ. 3,694 కోట్లతో ఐదు జాతీయ రహదారులను ప్రారంభించారు. (highway launch). ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy), రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy), సీతక్క (sitakka), ఎంపీలు (MPs), ఎమ్మెల్యేలు (MLAs) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక పైనుంచే 7 జాతీయరహదారులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, భూమికోసం, భుక్తి కోసం.. జిల్లా ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని, ఆదిలాబాద్ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిందని, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
చీకటి ఉండే చోట వెలుగులు నింపాలి...
చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, తనకు 13 డాక్టరేట్లు ఉన్నాయని.. తాను ఇంజనీరును కానని, అయినా 13 డాక్టరేట్లు ఉన్నాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఇక్కడి ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని అన్నారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టవిటీ మరింత పెరగనుందని, భద్రాద్రి, బాసర, మేడారం ఆధ్యాత్మిక క్షేత్రాలు హైవేతో అనుసంధానం చేస్తామని చెప్పారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మిస్తామన్నారు. నాగపుర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. జగిత్యాల- కరీంనగర్ హైవే విస్తరణ వేగవంతం చేస్తామని, వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులే దేశాభివృద్ధి అని అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Also Read: కౌలు రైతులకు శుభవార్త..
గత పదేళ్లలో తెలంగాణలో హైవేల విస్తీర్ణం...
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని... అభివృద్ధి విషయంలో కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ నమ్ముతారని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో హైవేల విస్తీర్ణం 5,100 కి.మీ.కు చేరుకుందని ఆయన అన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు...కేంద్రం రూ. 1.25 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి..కిషన్ రెడ్డి
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీనే లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ. 3,694.4 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయని, హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమదాలు తగ్గాయని.. సమయం తగ్గిందని అన్నారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైవేల విస్తీర్ణం 5 వేల కిలోమీటర్లు దాటిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్..
For More AP News and Telugu News