Home » Nitin Jairam Gadkari
Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ పథకం త్వరలో అమల్లోకి వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
సోమశిల నుంచి సిద్దేశ్వరానికి కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు.
తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి కేంద్ర సర్కారు సహకారం అందించాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్గా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
Central Minister Nitin Gadkari: చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు పర్యటించనున్నారు. పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోజుకు 100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
రహదారుల బలోపేతానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది, ఇందులో ఈశాన్య రాష్ట్రాలు మరియు సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఈశాన్య రహదారుల స్థాయి అమెరికా హైవేలా ఉండటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.