Share News

PBKS vs MI Qualifier 2: నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 07:28 AM

ఐపీఎల్ 2025లో నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ (PBKS vs MI Qualifier 2) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఉత్కంఠగా కొనసాగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, వెదర్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

PBKS vs MI Qualifier 2: నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
PBKS vs MI Qualifier 2

ఐపీఎల్ 2025లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మంచి ఫాంలో ఉంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ (MI vs GT)ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫైయర్ 2లో (PBKS vs MI Qualifier 2) చోటు దక్కించుకుంది. ఇప్పుడు క్వాలిఫైయర్-2లో నేడు (జూన్ 1న) ముంబై, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌ చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌ గెలుపు ఇరు జట్లకు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే నేటి పంజాబ్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, ఏ జట్టు ఫైనల్ చేరుకుంటుందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.


వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే

క్వాలిఫైయర్ 2 కోసం రిజర్వ్ డేను ఉంచారు. జూన్ 1న వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ జూన్ 2న జరుగుతుంది. రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా రద్దైతే, ఆ సందర్భంలో మ్యాచ్ రద్దు చేయబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో IPL 2025 పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు ఫైనల్‌కు అవకాశం పొందుతుంది. ఆ క్రమంలో పంజాబ్ కింగ్స్‌కు ఆధిక్యం లభిస్తుంది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ముంబై నాలుగో స్థానంలో ఉంది.


వాతావరణం ఎలా ఉంది..

క్వాలిఫయర్ 2 మ్యాచ్‌ గుజరాత్ అహ్మదాబాద్‌లో జరగనుంది. జూన్ 1న అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం దాదాపు లేదు. అక్యూవెదర్ ప్రకారం, జూన్ 1న వర్షం పడే అవకాశం 2 శాతం మాత్రమే ఉంది. మరోవైపు, జూన్ 2న వర్షం పడే అవకాశం 25 శాతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్వాలిఫయర్ 2 మ్యాచ్ జూన్ 1న పూర్తవుతుందని చెప్పవచ్చు.

హెడ్ టూ హెడ్

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై, పంజాబ్ కింగ్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో పంజాబ్ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది, ముంబై జట్టు 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ముంబై జట్టు రివేంజ్ తీర్చుకుంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. దీంతోపాటు గూగుల్ విన్ ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే ఈ మ్యాచులో ముంబై జట్టు గెలిచేందుకు 60 శాతం అవకాశం ఉండగా, పంజాబ్ జట్టుకు 40 శాతం ఛాన్సుంది.


ఇరు జట్ల ఆటగాళ్లు..

పంజాబ్ కింగ్స్ జట్టులో శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, విష్ణు వినోద్, జోష్ ఇంగ్లిస్, హర్నూర్ పన్ను, పైలా అవినాష్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, ప్రియాన్ హర్జాయ్, సురర్యన్ ఉమర్జాయ్, షెడ్గే, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విశాక్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ సేన్, జేవియర్ బార్ట్‌లెట్, ప్రవీణ్ దూబే ఉన్నారు.

ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, ర్యాన్ రికిల్టన్, శ్రీజిత్ కృష్ణన్, బెవోన్ జాకబ్స్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, రాజ్ అంగద్ బావా, విఘ్నేష్ పుతుర్, కార్బిన్ బాష్, షర్మా, ట్రెంట్ బౌల్ట్ టాప్లీ, సత్యనారాయణ పెన్మెత్స, అర్జున్ టెండూల్కర్, ముబీబ్-ఉర్-రెహమాన్, జస్ప్రీత్ బుమ్రా కలరు.


ఇవీ చదవండి:

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 07:30 AM