India U19 Squad: కంగారూల దేశానికి కుర్ర దళం..భారత్ U19 జట్టు రెడీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 10:01 AM
క్రికెట్ అభిమానులకు మరో అప్డేట్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారత అండర్-19 జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఆస్ట్రేలియా టూర్ కోసం అండర్-19 జట్టును (india u19 team to Australia) ప్రకటించింది. ఈ టూర్లో భారత యువ జట్టు, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డే మ్యాచ్లు, రెండు మల్టీ-డే మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 2025లో జరిగే ఈ సిరీస్ యువ క్రికెటర్లకు తమ సత్తా చాటేందుకు మంచి అవకాశమని చెప్పవచ్చు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ టూర్లో అతడు చూపించిన ప్రతిభ ఈ ఎంపికకు కారణమైంది. ఇంగ్లండ్లో జరిగిన యూత్ వన్డే సిరీస్లో 3-2 తేడాతో భారత్ విజయం సాధించగా, రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ డ్రాగా ముగిసింది. వైభవ్ లాంటి యువ క్రీడాకారులు ఈ టూర్లోనూ తమ ఆటతీరుతో ఆకట్టుకోవాలని ఆశిస్తున్నారు.
ఆయుష్ మాత్రే నాయకత్వం
ఈ టూర్కు ఆయుష్ మాత్రే జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టూర్లో కూడా అతడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. తన సారథ్యంలో భారత యువ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆయుష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ క్రికెటర్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
టూర్ షెడ్యూల్
సెప్టెంబర్ 21 నుంచి ఈ టూర్ మొదలు కానుంది. మూడు వన్డే మ్యాచ్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. అలాగే, మొదటి మల్టీ-డే మ్యాచ్ కూడా ఈ తేదీల్లోనే ఉంటుంది. రెండో మల్టీ-డే మ్యాచ్ అక్టోబర్ 7 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్లన్నీ నార్త్స్లో జరగనుండగా, రెండో మల్టీ-డే మ్యాచ్ మాకేలో ఆడనున్నారు.
జట్టు వివరాలు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుండు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, నామన్ పుష్పక్, హేనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్, అమన్ చౌహాన్ కలరు.
ఆస్ట్రేలియా గడ్డపై సవాల్
ఇంగ్లండ్ టూర్లో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న భారత అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా గడ్డపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ టూర్లో భారత యువ క్రికెటర్లు తమ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఉత్తమ ప్రదర్శన కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి