PBKS vs DC Toss: టాస్ గెలిచిన ఢిల్లీ.. పంజాబ్కు తిప్పలు తప్పవా!
ABN , Publish Date - May 24 , 2025 | 07:06 PM
పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన డీసీ సారథి అక్షర్ పటేల్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్కు దిగుతారు అనేది.. ఇప్పుడు చూద్దాం..

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ షురూ అయింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ నెగ్గిన డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అయ్యర్ సేన తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో పెద్దగా మార్పులు చేయలేదు పంజాబ్. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ను తుదిజట్టులోకి తీసుకున్నారు. మిచెల్ ఓవెన్ స్థానంలో అతడ్ని రీప్లేస్ చేశారు. అలాగే ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు బదులు హర్ప్రీత్ బ్రార్ను ప్లేయింగ్ ఎలెవ్లోని తీసుకున్నారు. మిగతా వాళ్లంతా రాజస్థాన్తో పోరులో ఆడినవాళ్లే.
రాహుల్-అక్షర్ లేకుండానే..
ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్లో పలు కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు విశ్రాంతిని ఇచ్చింది. అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ సెదీఖుల్లా అటల్ను రీప్లేస్ చేసింది. ఈసారి కరుణ్ నాయర్ను నేరుగా తుదిజట్టులోకి తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఈ పోరులో బరిలోకి దిగడం లేదు. అతడికి బదులు ఓపెనర్, సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. డీసీ ప్లేయింగ్ ఎలెవన్లో ఇవే కీలక మార్పులు. కాగా, టాస్ ఓడిన పంజాబ్కు ఈ మ్యాచ్లో గెలుపు చాలా అవసరం. పాయింట్స్ టేబుల్లో టాప్-2లో ఫినిష్ చేయాలంటే నెగ్గక తప్పని పరిస్థితి. దీంతో మొదట భారీ టార్గెట్ సెట్ చేయాలని చూస్తోంది. అయితే ఏమీ కోల్పోని స్థితిలో ఉన్న డీసీ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తే అయ్యర్ సేనకు కష్టాలు తప్పవు.
ఇవీ చదవండి:
టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి