Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
ABN , Publish Date - May 18 , 2025 | 04:33 PM
Coin Temple: దేవుడు గుడికి వెళ్లి తమ కోరికలు నెరవేరుస్తే..హుండిలో కొంత నగదు వేస్తామంటూ దేవుడికి మొక్కుకుంటారు. మరికొంత మంది అయితే ముడుపు సైతం కట్టి.. దేవుని వద్ద ఉంచుతారు.

బెంగళూరు, మే 18: దేవుడు గుడికి వెళ్లి తమ కోరికలు నెరవేరుస్తే..హుండిలో కొంత నగదు వేస్తామంటూ దేవుడికి మొక్కుకుంటారు. మరికొంత మంది అయితే ముడుపు సైతం కట్టి.. దేవుని వద్ద ఉంచుతారు. అలా తాము కోరిన కోరికను నెరవేరిన వెంటనే హుండిలో నగదు లేదా కట్టిన ముడుపు వేస్తారు. దాదాపుగా అందరు ఇలానే చేస్తారు. కానీ అందుకు భిన్నంగా భక్తులు.. ఈ దేవాలయంలో మొక్కుకుంటారు. అది కూడా తాము కోరిన కోరిక నెరవేరిన వెంటనే దేవాలయానికి నగదు ఇస్తారు. అది కూడా నాణెల రూపంలో ఆ దేవుడికి ఇచ్చి.. తమ ముక్కులు నెరవేర్చుకుంటారు.
ఈ అరుదైన ఆలయం బెల్గాం నుంచి 17 కి.మీ దూరంలో ఉంది. సులేభావి అనే గ్రామంలో గ్రామ దేవత మహాలక్ష్మిని జాగృతా దేవిగా కొలుస్తారు. ఐదు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ అమ్మ వారిని స్థానికులతోపాటు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందని లక్షలాది మంది భక్తులు కొలుస్తారు.
ఈ దేవాలయంలో కొలువు తీరిన దేవతను తమ కోరికలు నెరవేరిస్తే.. ఈ స్తంభానికి ఇన్ని నాణేలు ఇస్తామని మొక్కుకుంటారు. దీంతో వారి కోరిక నెరవేరితే.. నాణేలను ఆలయంలోని స్తంభాలు, దూలాలకు నాణెలు పెట్టి.. వాటికి మేకులు కొడతారు. దీంతో ఆలయంలోని స్తంభాలు, ద్వారాలు అన్ని నాణేలు నిండిపోయాయి. అందుకే దీనిని నాణేల ఆలయం అని పిలుస్తారు.
మరోవైపు ఆలయంలో అన్ని స్తంభాలు, ద్వారాలు నాణేలతో నిండిపోవడంతో.. ఈ ఆలయ కమిటీ ఇటీవల తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. నాణేలను స్తంభాలకు, ద్వారాలకు కొట్టడాన్ని నిషేధించింది. భక్తులు తమ కానుకలను విరాళాల పెట్టేలో సమర్పించాలంటూ నిబంధన విధించింది. అయితే దేవాలయంలో నాణేలు కొట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యంత పురాతనమైన నాణేలు సైతం ఉన్నాయని దేవాలయ కమిటీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత