Health Tips: మామిడి పండు జ్యూస్లో పాలు కలిపి తాగుతున్నారా.. అయితే ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..
ABN, Publish Date - Jun 14 , 2025 | 07:25 AM
మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే చాలా మంది అనేక పదార్థాలను మామిడి పండ్లతో కలిపి తీసుకుంటుంటారు. ఎక్కువగా పాలతో కలిపిన మిల్క్ షేక్ను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే..

మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే చాలా మంది అనేక పదార్థాలను మామిడి పండ్లతో కలిపి తీసుకుంటుంటారు. ఎక్కువగా పాలతో కలిపిన మిల్క్ షేక్ను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ మిల్క్ షేక్ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం పాలు, మామిడిపండు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పాటు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఈ రెండింటిని కలిపి తీసుకోవడం కడుపు తిమ్మిరి, వికారం లేదా విరేచనాలకు దారితీస్తుంది.

మామిడితో పాలు కలిపి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది.

పాలతో మామిడిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మంపై మొటిమలు, దద్దుర్లు, అలెర్జీలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

మామిడి పండు వేడిని పెంచుతుంది. పాలు, మామిడి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోతుంది.

తాజా మామిడి పండ్లను పాలతో కలపకుండా విడిగా జ్యూస్ చేసుకుని తాగితే మంచిది. అలాగే పాలను కూడా మామిడితో కలపకుండా విడిగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jun 14 , 2025 | 07:26 AM