Facial Beauty Tips: స్నానానికి ముందు 5 నిముషాల పాటు మీ ముఖంపై ఇవి రాస్తే జరిగేది ఇదే..
ABN, Publish Date - Jun 08 , 2025 | 07:10 AM
ప్రస్తుతం యువత ముఖ సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మెరుపును తీసుకురావచ్చనే విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం పెరిగే అవకాశం ఉంటుంది..

ప్రస్తుతం యువత ముఖ సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మెరుపును తీసుకురావచ్చనే విషయాన్ని మర్చిపోతున్నారు. స్నానానికి ముందు 5 నిముషాల పాటు ముఖంపై కొన్నింటిని అప్లై చేయడం వల్ల అద్భుతమైన మెరుపు సొంతమవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

స్నానానికి ముందు కాటన్ను పాలలో ముంచి ముఖంపై సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా 5 నిముషాలు చేసిన తర్వాత కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై మృత కణాల తొలగిపోయి, తాజాగా కనిపిస్తుంది.

శనగపిండి, పెరుగు మిశ్రమం కూడా బాగా పని చేస్తుంది. చెంచా శెనగపిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖంపై మసాజ్ చేయాలి. 5 నిముషాలు ఇలా చేసిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది.

చర్మ సంరక్షణలో టమాటా రసం కూడా బాగా పని చేస్తుంది. టమాటా గుజ్జును ముఖంపై 5 నిముషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

స్నానానికి ముందు దోసకాయ రసాన్ని 5 నిముషాల పాటు అప్లై చేయాలి. ఇది చర్మంపై మృత కణాలను తొలగించి, మెరిసేలా చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jun 08 , 2025 | 07:10 AM