Warangal: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు..
ABN, Publish Date - May 18 , 2025 | 08:06 PM
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరం త్రివేణి సంగమానికి వివిధ రాష్ట్రాల నుంచి నాలుగో రోజున కూడా భక్తులు పోటెత్తారు.

తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈ నెల 15వ తేదీన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు ఆరంభమయ్యాయి. నాలుగో రోజున కూడా ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ పుష్కరాలు నిర్వహిస్తుంది.

వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాళేశ్వరం పరిసరాలు వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వేలాది భక్తులు తరలివచ్చి కాళేశ్వర తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
Updated at - May 18 , 2025 | 08:15 PM