Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 29 , 2025 | 07:43 PM
నాగ పంచమి నేపథ్యంలో మంగళవారం నాగేంద్రస్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

శ్రావణమాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఇది జులై 29వ తేదీ.. అంటే మంగళవారం ఈ రోజు వచ్చింది.

ఈ నేపథ్యంలో శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి) వారి దేవాలయాలకు భక్తిలు పోటెత్తారు.

అదీకాక మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు.

దీంతో మంగళవారం నాగపంచమి కూడా కావడంతో.. ఆ స్వామి వారిని పూజించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నాగేంద్ర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ వెంగళరావు నగర్లోని నాగదేవతల దేవాలయానికి భారీగా భక్తుల తరలి వచ్చారు.

అలాగే కంటోన్మెంట్ ప్రాంతం లాల్ బజార్లోని నాగదేవత దేవాలయం వద్ద మహిళలు పాలతో అభిషేకం చేశారు.

ఇక కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం, షాపూర్ నగర్, ఐడీపీఎల్ పరిధిలోని దేవాలయాల్లో నాగేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏపీలోని అనంతపురంలో నాగుల పంచమి సందర్భంగా పుట్టల్లో పాలు పోసేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు.

దేవాలయాల్లోని రావి చెట్టు కింద నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రావి చెట్టు కింద నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రదక్షణలు చేశారు.

దేవాలయాల్లోని నాగ ప్రతిమలకు పాలు పోసి.. పసుపు, కుంకుమలు చల్లి, ప్రసాదం నైవేద్యంగా పెట్టి దణ్ణం పెట్టిన భక్తులు
Updated at - Jul 29 , 2025 | 07:46 PM