శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి.. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ
ABN, Publish Date - May 12 , 2025 | 07:45 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాలు, సన్నాయి మేళాలతో నిత్యారాధనలు చేస్తున్నారు. దివ్యమనోహరంగా స్వామివారిని అలంకరించి వేద పారాయణాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆదివారం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ గోమాతతో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకట్రావు, భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు జాతీయ పతాకాన్ని పట్టుకుని స్వామివారి నామాలను జపిస్తూ భక్తి ప్రవత్తులతో ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి.

వేదమంత్రాలు, సన్నాయి మేళాలతో స్వామివారికి నిత్యారాధనలు చేస్తున్నారు. స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి వేద పారాయణాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఆదివారం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ గోమాతతో గిరి ప్రదక్షిణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకట్రావు, భక్తులు భారీగా పాల్గొన్నారు.

భక్తులు జాతీయ పతాకాన్ని పట్టుకుని స్వామివారి నామాలను జపిస్తూ భక్తి ప్రవత్తులతో స్వామివారి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

స్వామివారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. ఈ దారిలో అధికారులు వసతులు కల్పించారు.

ఆలయ అధికారులు గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.
Updated at - May 12 , 2025 | 07:53 AM