సింగపూర్లో సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు
ABN, Publish Date - Jul 30 , 2025 | 08:32 PM
నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఎన్నారైలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 26 సమావేశాలు నిర్వహించారు. అలాగే సింగపూర్ దేశాధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సింగపూర్ పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీ సీఈఓలకు వివరించారు.

నాలుగు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సింగపూర్ నుంచి అమరావతికి బయలుదేరారు. అంతకుముందు సింగపూర్లో ఆయన బస చేసిన హోటల్కు తెలుగు ఎన్నారైలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

ఈ సందర్భంగా హోటల్ బయట సీఎం చంద్రబాబుతో వారు సెల్ఫీలు తీసుకున్నారు. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. జై సీబీఎన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురిని ఆయన భుజం తట్టి స్వయంగా పలకరించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు.

అలాగే హోటల్ సిబ్బంది సైతం సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. సీఎం చంద్రబాబుకు తెలుగు ఎన్నారైలు ఘనంగా వీడ్కోలు పలికారు.
Updated at - Jul 30 , 2025 | 09:17 PM