టీడీపీ నేత వీరయ్య చౌదరికి సీఎం చంద్రబాబు నివాళి
ABN, Publish Date - Apr 24 , 2025 | 08:12 AM
మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరి కుటుంబానికి తాను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న సీఎం చంద్రబాబు

అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.

వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న తెలుగుదేశం నేతలు

సీఎం చంద్రబాబుతో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులు, మరో చిత్రంలో మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి

వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని చూడటానికి వస్తున్న ప్రజలు

టీడీపీకి వీరయ్య చౌదరి చేస్తున్న సేవలను మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆ సమయంలో లోకేష్తో వీరయ్య చౌదరి ఫొటో దిగారు.

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న సీఎం చంద్రబాబు

వీరయ్య చౌదరి నివాసం వద్ద ప్రజలు, కూటమి నేతలు

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై కత్తులతో గుర్తు తెలియని నలుగురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.

వీరయ్య చౌదరి ఛాతి భాగంలో 20కి పైగా కత్తి పోట్లను వైద్యులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ దామోదర్ పరిశీలించారు. వీరయ్య చౌదరి దారుణ హత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీరయ్య చౌదరి కుటుంబానికి తాను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Updated at - Apr 24 , 2025 | 10:26 AM