ఉగ్రదాడుల్లో విశాఖ వాసి చంద్రమౌళి మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం
ABN, Publish Date - Apr 24 , 2025 | 09:04 AM
జమ్మూ కశ్మీర్లోని పహెల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నానికి చెందిన జేఎస్ చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నివాళులు అర్పించారు. విశాఖ ఎయిర్పోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోడియంపై ఉంచిన చంద్రమౌళి భౌతిక కాయంపై సీఎం చంద్రబాబు స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు.

జమ్మూ కశ్మీర్లోని పహెల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నానికి చెందిన జేఎస్ చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.

చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న సీఎం చంద్రబాబు

విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చంద్రమౌళి భౌతిక కాయం బుధవారం రాత్రి 10 గంటలకు చేరుకుంది.

విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా రిసీవ్ చేసుకుని సంతాపం వ్యక్తం చేశారు.

చంద్రమౌళి భౌతికకాయాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు.

చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

చంద్రమౌళి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న కుటుంబ సభ్యులు, కూటమి నేతలు, ప్రజలు

చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న సీఎం చంద్రబాబు

విశాఖపట్నం విమానాశ్రయంలో అధికారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

చంద్రమౌళి భౌతికకాయం వెంట కుటుంబ సభ్యులు, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి నేతలు, విశాఖపట్నం వాసులు ఉన్నారు.
Updated at - Apr 24 , 2025 | 10:23 AM