Masula Beach Festival 2025: మచిలీపట్నంలో 2కే రన్లో పాల్గొన్న భైరవం మూవీ టీం
ABN, Publish Date - Jun 04 , 2025 | 09:04 AM
మచిలీపట్నంలో ఈనెల 5,6,7,8 తేదీల్లో నిర్వహించనున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025లో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ వరకూ 2కే రన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, శాప్ చైర్మన్ రవి నాయుడు, జిల్లా కలెక్టర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా క్రీడాజ్యోతిని వెలిగించి 2కే రన్లో ప్రారంభించారు. అనంతరం మంగినపూడి బీచ్లో జరుగుతున్న ఫెస్టివల్ ఏర్పాట్లను శాప్ ఛైర్మన్తో కలిసి భైరవం మూవీ టీమ్ సభ్యులు సందర్శించారు.
























Updated at - Jun 04 , 2025 | 09:11 AM