Bhopal Shocker: అమ్మ బాబోయ్.. 7 నెలల్లో 25 మంది మగాళ్లను పెళ్లి చేసుకుంది..
ABN , Publish Date - May 20 , 2025 | 02:35 PM
Bhopal Shocker: ఆ గ్యాంగులోని సునీత, పప్పు మీనాలు.. 7 నెలల్లో 25 మంది మగాళ్లతో అనురాధకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత సరైన టైం చూసుకుని అనురాధ డబ్బు, ఇతర సొమ్ముతో పారిపోయేది. దోచుకున్న దాన్ని గ్యాంగులోని వారు సమానంగా పంచుకునే వారు.

30 ఏళ్లు దాటి ఇంకా పెళ్లి కాకుండా ఉన్న మగాళ్లు దేశంలో కుప్పలు, తెప్పలుగా ఉన్నారు. కట్నం, ఆస్తి లేకున్నా పర్లేదు.. అమ్మాయి అయితే చాలు అన్న పరిస్థితి ఏర్పడింది. ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న మగాళ్లు ఉన్నారు. పెళ్లి కూతుర్ల కరువును ఆసరాగా చేసుకుని కొంతమంది మోసగత్తెలు దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో నిత్య పెళ్లి కూతుర్ల మోసాలు తరచుగా బయటపడుతున్నాయి. కొంతమంది అమ్మాయిలు .. డబ్బుల కోసం పెళ్లి చేసుకుని.. అవకాశం దొరకగానే డబ్బు, సొమ్ముతో ఉడాయిస్తున్నారు.
తాజాగా, మధ్య ప్రదేశ్లోని భోపాల్లో ఓ నిత్య పెళ్లి కూతురి బాగోతం బయటపడింది. ఆమె ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. అది కూడా ఏడు నెలల్లో ఈ అచీవ్మెంట్ సాధించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లోని మహారాణి గంజ్కు చెందిన అనురాధ కొన్ని నెలల క్రితం భర్తతో గొడవల కారణంగా మధ్య ప్రదేశ్లోని భోపాల్కు వచ్చేసింది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఓ వాట్సాప్ గ్రూపు ద్వారా పెళ్లిళ్ల మోసాలకు పాల్పడే గ్యాంగ్తో సంబంధం ఏర్పడింది.
ఆ గ్యాంగులోని సునీత, పప్పు మీనాలు.. 7 నెలల్లో 25 మంది మగాళ్లతో అనురాధకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత సరైన టైం చూసుకుని అనురాధ డబ్బు, ఇతర సొమ్ముతో పారిపోయేది. దోచుకున్న దాన్ని గ్యాంగులోని వారు సమానంగా పంచుకునే వారు. రాజస్తాన్లోని సవాయ్ మాధాపూర్కు చెందిన విష్ణు శర్మను కూడా అలాగే మోసం చేశారు. తాను మోసపోయానని గుర్తించిన అతడు మే 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ అనురాధను పట్టుకున్నారు. మిగిలిన గ్యాంగు సభ్యుల్ని కూడా పట్టుకునే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
Get Rid of Sweat Smell: చెమట వాసనకు గుడ్బై చెప్పే ఇంటి చిట్కాలు..
Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు