Share News

Bengaluru: జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - May 06 , 2025 | 03:51 AM

కర్ణాటకలోని కలబురగి నీట్‌ పరీక్షకేంద్రంలో విద్యార్థి జంధ్యం తొలగించిన ఘటనపై ఇద్దరు పరీక్ష కేంద్ర ఉద్యోగులను అరెస్ట్‌ చేశారు. ధార్మిక అభిమానం దెబ్బతినిందంటూ కేసు నమోదు కాగా, సంఘాలు నిరసనకు దిగాయి

Bengaluru: జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

బెంగళూరు, మే 5(ఆంధ్రజ్యోతి): కలబురగి పరీక్ష కేంద్రంలో నీట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థి జంధ్యం తొలగించిన వివాదంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ధార్మిక భావనలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు పరీక్షకేంద్రం ఉద్యోగులు శరణగౌడ, గణేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని కలబురగి పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌డీ శరణప్ప సోమవారం తెలిపారు. పరీక్ష జరిగిన తర్వాత శ్రీపాదపాటిల్‌ అనే విద్యార్థి స్టేషన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. జంధ్యం తొలగింపు ఘటనకు నిరసనగా కలబురగిలో బ్రాహ్మణ సంఘాలు ఆదివారం సాయంత్రం ఆందోళన చేశాయి.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:51 AM