Tech Layoffs: టెక్ ఉద్యోగాలకు కత్తెర
ABN , Publish Date - May 24 , 2025 | 05:06 AM
దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ఉద్యోగాలకు కోతలు పెడుతున్న వాటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్ వంటి సంస్థలు ఉన్నాయి.

దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న కోత
ఈ ఏడాది 61 వేల మంది తొలగింపు
న్యూఢిల్లీ, మే 23: దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ఉద్యోగాలకు కోతలు పెడుతున్న వాటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్ వంటి సంస్థలు ఉన్నాయి. ఆదాయ ఆర్జన మందగించడం, ఆర్థిక అనిశ్చితి కొనసాగడం, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం పెరగడం తదితర కారణాల వల్ల ఈ కంపెనీలు ఉద్యోగులకు లేఆ్ఫలు ప్రకటిస్తున్నాయి. 2025లో ఇప్పటి వరకు 130 కంపెనీలు 61 వేల మంది ఉద్యోగులను తొలగించాయని లేఆ్ఫ్సడాట్ఎ్ఫవైఐ సంస్థ వెల్లడించింది. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగుల్లో ఈ ఏడాది 6 వేల మందిని ఇంటికి పంపించింది. వాషింగ్టన్ రాష్ట్రంలోనే 2 వేల మందికి ఉద్వాసన పలికింది. 2023 తర్వాత ఆ కంపెనీలో ఇంత ఎక్కువ మందిని తీసివేయడం ఇదే మొదటిసారి.
గూగుల్లో అయితే 2023లో 12 వేల మందిని ఒకేసారి తొలగించిన తర్వాత కూడా ఆ పంథాను స్థిరంగా కొనసాగిస్తోంది. తన ఆపరేషన్ మోడల్ను మెరుగుపరిచే క్రమంలో ఈ ఏడాది పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్లలో ఉద్యోగాలకు కత్తెర వేసింది. ఇక ఈనెల ప్రారంభంలో తన యాడ్ సేల్స్, భాగస్వామ్య విభాగాలను నిర్వహించే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి 200 మందిని తొలగించింది. వఈ ఏడాది అమెజాన్ తన డివైజెస్ అండ్ సర్వీస్ విభాగంలో 100 మందిని పక్కనబెట్టింది. ఈ విషయంలో ఐబీఎం కొంత వైవిధ్యాన్ని చూపుతోంది. ఓ పక్క హెచ్ఆర్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తూ ఆ స్థానాలను ఏఐ టెక్నాలజీతో పూరిస్తోంది. మిగిలిన నిధులతో ప్రోగ్రామింగ్, సేల్స్లో నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటోంది.