CM Stalin: 24న ఢిల్లీ వెళ్లనున్న సీఎం స్టాలిన్..
ABN , Publish Date - May 18 , 2025 | 11:22 AM
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఈ నెల 24న ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే నీతి ఆయోగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 24న ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 2015లో కేంద్ర ప్రణాళికా సంఘానికి బదులుగా నీతి ఆయోగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ 9 సార్లు ఈ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ కమిటీ పదో సమావేశం ఈ నెల 24న ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగనుది.
ఈ వార్తను కూడా చదవండి: Pakistan Peace Delegation: భారత్ను కాపీ కొడుతున్న పాక్.. తప్పుడు ప్రచారాలకు తెర..
ఈ సమావేశంలో పాల్గొనాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆహ్వానించింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు స్టాలిన్ వెళ్తున్నారు. గత ఏడాది జూలై 27న జరిగిన నీతి ఆయోగ్ 9వ సమావేశాన్ని స్టాలిన్ బహిష్కరించారు. ఈ పరిస్థితులలో ఈ నెల 24న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో స్టాలిన్ పాల్గొననున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచిన నిధులను విడుదల చేయాలని స్టాలిన్ ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం
MP Arvind:కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు
Read Latest Telangana News and National News