Tahawwur Rana: ప్లీజ్ అనుమతించండి.. ఎన్ఐఏ కోర్టును కోరిన తహవ్వుర్ రాణా
ABN , Publish Date - May 27 , 2025 | 06:58 PM
రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది.

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల (26/11 Mumbai terror attack)కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana) ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టును మంగళవారంనాడు ఆశ్రయించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. జైలు నిబంధనలకు అనుగుణంగానే తనకు ఈ వెసులుబాటు కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాణా తరఫు న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ బుధవారంనాడు ఈ పిటిషన్పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది. ఢిల్లీకి చేరుకోగానే ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించడంతో భారీ భద్రత మధ్య తీహార్ జైలుకు జైలుకు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన జైల్ నెంబర్ 2లో ఆయనను ఉంచారు. జైలు బయట సెక్యూరిటీ సిబ్బంది, 24 గంటలూ ఆయన కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఆయన అకామిడేషన్, సెక్యూరిటీ అరేంజ్మెంట్లపై అధికారికంగా జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
Read Latest National News and Telugu News