Share News

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. బబ్బర్ ఖల్సా ఉగ్రవాది మృతి

ABN , Publish Date - May 27 , 2025 | 03:38 PM

బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ అన్నారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని చెప్పారు.

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. బబ్బర్ ఖల్సా ఉగ్రవాది మృతి

చండీగఢ్: పంజాబ్‌ (Punjab)లోని అమృత్‌సర్‌ (Amritsar)లో మంగళవారంనాడు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నగరంలోని మజితా బైపాస్ రోడ్డులో ఒక వ్యక్తి బాంబును వెలికితీస్తుండగా అది చేతిలో పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని అమృత్‌సర్ రూరల్ ఎస్ఎస్‌పీ మణిందర్ సింగ్ తెలిపారు. బాంబును తప్పుగా ఆపరేట్ చేయడం వల్ల పేలి ఉండవచ్చని, మృతి చెందిన వ్యక్తికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు.


భారీ శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలిలోని ఆధారాలను సేకరిస్తోంది.


ఈ సంఘటనపై బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ మాట్లాడుతూ, బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని చెప్పారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని అన్నారు. సహజంగా ఇలాంటి నిర్జన ప్రదేశాల్లోనే దేశవ్యతిరేక శక్తులు బాంబులు సరఫరా చేస్తుంటాయని, వేరెవరో వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుని ఉగ్రఘటనలకు పాల్పడుతుంటారని చెప్పారు. గతంలో తాము ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో ఈ విషయం తేలిందన్నారు. బాంబు పేలుడులో మృతి చెందిన వ్యక్తి బబ్బర్ ఖల్సాలో చురుకుగా పనిచేస్తున్న వ్యక్తి కావచ్చన్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..

ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పా‌క్‌కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2025 | 04:08 PM