Share News

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

ABN , Publish Date - May 02 , 2025 | 02:57 PM

తనకు, తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాది నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులు భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగళూరుకు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి అహ్మద్ తారిఖ్ భట్‌కు ఊరట లభించింది. దేశం విడిచి వెళ్లాల్సిందిగా తారిఖ్, అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. తనకు, తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

India Extends Deadline: పాకిస్థానీలు భారత్‌ వీడేందుకు గడువు పొడిగింపు


దీనిపై తదుపరి ఉపశమనం కోసం హైకోర్టుకు వెళ్లేందుకు భట్‌‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. భట్ వ్యవహారంలో మానవతా కోణం ఉందని వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో తాము ఇచ్చిన ఆదేశాలు తక్కిన కేసుల్లో వాడుకోరాదని కూడా స్పష్టం చేసింది.


ఇండియాకు ఎలా వచ్చారు?

శుక్రవారం ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా ఇండియాకు మీరెలా వచ్చారని భట్‌ను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పాకిస్థాన్‌లోని మీర్‌పూర్‌లో పుట్టిన భట్ ఇండియాకు ఎందుకు, ఎలా వచ్చారని ప్రశ్నించింది. పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో కలిగిన తన తండ్రితో 1997లో తాను భారత్‌కు వచ్చినట్టు భట్ సమాధానమిచ్చారు. శ్రీనగర్ వచ్చిన తర్వాత తాను పాక్ పాస్‌పోర్టును జమ్మూకశ్మీర్ హైకోర్టులో సరెండర్ చేశానని, ఆ తర్వాత తాను దరఖాస్తు చేసుకుని ఇండియన్ పాస్‌పోర్ట్ పొందానని చెప్పారు. మూడేళ్ల తర్వాత 2000లో తన కుటుంబ సభ్యులతా శ్రీనగర్ వచ్చారని, ప్రతి ఒక్కరూ భారత పాస్‌పోర్టు పొందారని చెప్పారు. తాను, తన కవల పిల్లలు సిటీలోని ప్రైవేటు స్కూలులో చదుపుకున్నట్టు కోర్టుకు వివరించారు. పక్కా డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ తమను దేశం విడిచి వెళ్లాల్సిందిగా హోం మంత్రిత్వ శాఖ గత వారం నోటీసులు జారీ చేసిందన్నారు. వీసాలపై ఇండియా వచ్చి గడువు మించిపోయినా ఇక్కడే ఉన్నట్టు ఆ నోటీసులో తప్పుగా పేర్కొన్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 02 , 2025 | 02:58 PM