Sunil Mittal: భారత మార్కెట్లో మరో భారీ డీల్
ABN , Publish Date - May 11 , 2025 | 09:38 PM
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..

Sunil Mittal - Haier: ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన హైయర్ స్మార్ట్ హోమ్ కో. యొక్క భారతీయ యూనిట్లో ఆయన దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన 49 శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తున్నారని బ్లూమ్బెర్గ్ చెబుతోంది. దీనికి సంబంధించి కీలక వ్యక్తుల నుంచి సమాచారం ఉందని పేర్కొంది. కాగా, హైయర్ కంపెనీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను తయారు చేస్తుందన్న సంగతి తెలిసిందే.
భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ అధినేత సునీల్ మిట్టల్.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన వార్బర్గ్ పింకస్తో కలిసి ఈ వాటాను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. కొన్ని ఆమోదాలు ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ, రాబోయే వారాల్లో ఈ ఒప్పందంపై సంతకం చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నందున, దీనిపై హైయర్ ప్రకటనే తుది నిర్ధారణ అవుతుంది. కాగా, గత నెలలో, ది ఎకనామిక్ టైమ్స్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కూడా ఈ వాటాను కొనుగోలు చేయడానికి కీలక పోటీదారు అని రాసుకొచ్చింది.
హైయర్ భారతదేశంలో తన వృద్ధిని కొనసాగించాలని యోచిస్తోంది
కాగా, హైయర్ సంస్థ తన వ్యాపారాన్ని భారత దేశంలో మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఈ సంస్థ 2024లో దాదాపు రూ.8,900 కోట్లతో తన ఆదాయంలో 36 శాతం వృద్ధిని నివేదించింది. గృహోపకరణాల మార్కెట్లో హైయర్ భారతదేశంలో LG, శామ్సంగ్ తర్వాత మూడవ స్థానంలో ఉందని ది ఎకనామిక్ టైమ్స్ అంటోంది. అంతేకాకుండా, 2025లో ఈ సంస్థ ఆదాయం రూ.11,500 కోట్లు దాటుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు హైయర్ అప్లయన్సెస్ ఇండియా అధ్యక్షుడు NS సతీష్ PTIకి తెలిపారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
మనూరొచ్చిన ముద్దబంతి పువ్వులు