Share News

Chennai: మీవల్లే మేం క్షేమంగా తిరిగొచ్చాం.. థ్యాంక్స్‌ సీఎం సార్‌..

ABN , Publish Date - May 21 , 2025 | 11:35 AM

థ్యాంక్స్‌ సీఎం సార్‌.. అంటూ 242 మంది విద్యార్థినీ, విద్యార్థులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏కు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్‌ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిచేసి కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే.. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో వ్యవసాయం, ఉద్యానవన దాని అనుబంధ ఉన్నత విద్యకోసం రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి చిక్కుకుపోయారు. వారంతా తిరిగి ఇక్కడకు వచ్చారు.

Chennai: మీవల్లే మేం క్షేమంగా తిరిగొచ్చాం.. థ్యాంక్స్‌ సీఎం సార్‌..

చెన్నై: జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి క్షేమంగా తిరిగొచ్చిన రాష్ట్ర విద్యార్థులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్‌ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిచేసి దారుణంగా హతమార్చిన నేపథ్యంలో, ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి, పీఓకే, పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల నివాసాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Minister: ఏం డౌట్ లేదు.. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు


ఇదే సమయంలో పాకిస్తాన్‌ తన వక్రబుద్ధిని చూపుతూ సరిహద్దుల్లోని ప్రజల నివాసాలపై డ్రోన్లు, బాంబులతో దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో వ్యవసాయం, ఉద్యానవన, మత్స్య, పట్టుగూళ్ల పెంపకం కోర్సులు, ఎన్‌ఐఎఫ్టీ, ఎన్‌ఐటీ తదితర ఉన్నత విద్య కళాశాలల్లో చదువుకుంటున్న రాష్ట్రానికి చెందిన 242 మంది విద్యార్థినీ, విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు.


nani2.2.jpg

ప్రత్యేక విమానంలో విద్యార్థులు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌కు చేరుకుని, అక్కడి నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి క్షేమంగా తిరిగొచ్చిన విద్యార్థులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ఎం నాజర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

గోవుల అక్రమ రవాణా

Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2025 | 11:35 AM