Share News

Sri Ramulu: సర్కార్‌ నిర్లక్ష్యంతోనే అభిమానుల మృతి

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:51 PM

బెంగళూరులో ఆర్‌సీబీ క్రికెట్‌ జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ధ్వజమెత్తారు.

Sri Ramulu: సర్కార్‌ నిర్లక్ష్యంతోనే అభిమానుల మృతి

- ఏ-1 గా సీఎం, ఏ-2గా డీసీఎం, ఏ-3గా హోంమంత్రిపై కేసు పెట్టి.. అరెస్ట్‌ చేయాలి

- సీబీఐతో విచారణ చేయించాలి

- బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి శ్రీరాములు ధ్వజం

బళ్లారి(బెంగళూరు): బెంగళూరులో ఆర్‌సీబీ క్రికెట్‌ జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలో హావంబావి సమీపంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్రీరాములు ప్రమాదానికి కారకులైన సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోం మంత్రి పరమేశ్వర్పల పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీజేపీ నాయకుడు, డిమాండ్‌ చేశారు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడారని, 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని ధ్వజమెత్తారు.


ఆర్‌సీబీ అనే క్రికెట్‌ టీం ఓ ప్రైవేటు వ్యక్తి నడుపుతున్న జట్టు అని ఇలాంటి టీంకు కర్నాటక ప్రభుత్వం సన్మానం చేయడమే విడ్దూరమన్నారు. సన్మానం చేసినా అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు నిర్వహించలేకపోయారన్నారు. ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరించిందన్నారు. విధానసౌధలోనే సన్మానం చేసి, చిన్నస్వామి స్టేడియం వరకు ఊరేగింపునకు ఎంత మంది వస్తారో ఊహించలేక పోయారన్నారు. ప్రభుత్వం, ఆర్‌సీబీ టీం మృతులకు నష్టపరిహం చెల్లిస్తున్నారు. ఇక్కడ పరిహారం అనేది ప్రశ్న కాదు, అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పొయిన వారిలో వేల కోట్లకు పడగలెత్తిన ఆస్తిపరులూ ఉన్నారు. పరిహారం వారి బాధ తీర్చలేదన్నారు.


pandu3.jpg

ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తెంలంగాణాలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అల్లు అర్జున్‌ సినిమాకు వెళ్లిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందితే, ఇందుకు బాధ్యుడిగా సినీ హీరో అల్లు అర్జున్‌ పై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. ఇక్కడు కూడా సీఎ, డీసీఎంలపై కేసు నమోదు చేయాలన్నారు. విలేకరులు సమావేశంలో బుడా మాజీ అధ్యక్షుడు, బీజేపీ కార్పొరేటర్‌ ఇబ్రహీం బాబు, గోవింద రాజులు, కోనంకి తిలక్‌, తిమ్మప్ప, దివాకర్‌, మల్లనగౌడ, తదితర బీజేపీ కార్పొరేటర్ల, నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Jun 07 , 2025 | 01:51 PM