Share News

Trains: ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:51 PM

రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుండి జూన్‌ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

Trains: ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పు..

చెన్నై: రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుండి జూన్‌ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుచెందూర్‌ నుంచి చెన్నై ఎగ్మూర్‌కు బయలుదేరే రైలు (నెం:20606) బన్రూటి రైల్వేస్టేషన్‌లో ఉదయం 6.04 గంటలకు ఆగివెళ్తుంది. ఈ రైలు 25 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఎగ్మూర్‌-విల్లుపురం మధ్య నడుపుతున్న ఎక్స్‌ప్రెస్‌ వేళలో ఎలాంటి మార్పు ఉండదని దక్షిణ రైల్వేశాఖ స్పష్టం చేసింది.


తిరునల్వేలి నుండి గుజరాత్‌ రాష్ట్రం హబ్బాకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ (నెం: 19577) ఈ నెల 15 నుండి ఉదయం 5.05 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా తిరునల్వేలి నుంచి గాంధీగ్రామ్‌ వెళ్ళే రైలు (నెం: 20923) ఉదయం 5.05 గంటకు బయలుదేరుతుంది. కోవై నుంచి హర్యానా రాష్ట్రం కిసార్‌కు వెళ్ళే రైలు (నెం: 22476) మధ్యాహ్నం 1.35 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరుతుంది. మరుమార్గంలో ముంబాయి నుండి రైలు (నెం: 22629) మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది.


తిరునల్వేలి నుండి వెళ్లే దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం: 22630) సహా 37 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సమయాలు మార్పు చేశారు. రామనాథపురం జిల్లా పరమకుడి, చత్రకుడి రైల్వేస్టేషన్ల మధ్య మరమ్మతుల కారణంగా మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో కూడా మార్పు చేశారు. ఆ మేరకు తిరుచ్చి నుంచి జూన్‌ 12,14,16,21,23, జూలై 4వ తేదీల్లో ఉదయం 7.05 గంటలకు రామేశ్వరం బయలుదేరే రైలు (నెం:10849) మానామదురై, రాముశ్వరం మధ్య పాక్షికంగా రద్దు చేసి, మానామదురైలో ఆపుతారు. మరుమార్గంలో అదే రైలు రామేశ్వరం నుండి సాయంత్రం 3గంటలకు బయలుదేరుతుంది.


nani6.2.jpg

తిరుచ్చి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ (నెం: 16850) రామేశ్వరం-మానామదురై మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఆ రైలు రామేశ్వరం నుంచి బదులుగా మానామదురై నుండి సాయంత్రం 4.55 గంటలకు తిరుచ్చి బయలుదేరుతుంది. అలాగే రామేశ్వరం నుండి జూన్‌ 13,20,27 తేదీల్లో ఉదయం 9.15 సికింద్రాబాద్‌(Secundrabad) వెళ్ళాల్సిన ప్రత్యేక రైలు (నెం: 07696) రాత్రి 7 గంటలకు 19.50 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి.

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 12:51 PM