Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
ABN , Publish Date - May 18 , 2025 | 05:45 PM
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కాగా, కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

పాకిస్థాన్కు గోప్యమైన సమాచారం లీక్ చేసిందన్న ఆరోపణలపై హర్యానా హిసార్కు చెందిన ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ ట్రావెల్ విత్ జో ద్వారా పాకిస్థాన్కు సీక్రెట్ సమాచారం పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శశాంక్ కుమార్ సావన్ ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా..
ఈ క్రమంలో మోడరన్ యుద్ధం సరిహద్దులు దాటిందని, విదేశీ ఏజెన్సీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసుకుని వారి ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs)తో ముఖ్యంగా ఈషాన్-ఉర్-రహీమ్ (దానిష్)తో, WhatsApp, Telegram, Snapchat వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా గోప్య సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించామన్నారు.
పాకిస్థాన్, చైనా పర్యటనలు
అంతేకాదు 2023లో జ్యోతి పాకిస్థాన్కు రెండు సార్లు పర్యటించినట్లు వెల్లడించారు. అక్కడ ఆమెకు పాకిస్థాన్ హై కమిషన్ ఉద్యోగి దానిష్ వసతి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. అలీ ఎహ్వాన్ ఆమె పర్యటనలను చూసుకున్నాడని, దీంతోపాటు ఆమె చైనాకు కూడా ఒకసారి పర్యటించినట్లు చెప్పారు. ఆ క్రమంలో ఆమె వీడియోలు పాకిస్థాన్ పర్యటనల గురించి ఉండేవని గుర్తించినట్లు వెల్లడించారు. వాటిలో పాకిస్థాన్ స్థలాల గురించి సమాచారం ఉండేది. ఆ వీడియోల ద్వారా పాకిస్థాన్ సమర్థతను పెంచేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.
దానిష్, ఇతర PIOలతో సంబంధం
దానిష్, పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే ఉద్యోగి, జ్యోతి మల్హోత్రాకు హ్యాండ్లర్గా వ్యవహరించారు. అతను ఆమెను ఇతర PIOలతో పరిచయం చేశారు. వారిలో షకీర్, రానా షాహ్బాజ్ కూడా ఉన్నారు. జ్యోతి మల్హోత్రా ఇతర యూట్యూబ్ ఇన్ఫ్ల్యూయెన్సర్లతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో వారు కూడా PIOలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఆమె ప్రయాణాలకు ఆమె ప్రకటించిన ఆదాయంతో సంబంధం లేకుండా ఉందన్నారు ఎస్పీ సావన్. ఆమె స్పాన్సర్డ్ ట్రప్ల ద్వారా పాకిస్థాన్ సందర్శించినట్లు చెప్పారు. అంతేకాదు పహల్గామ్ దాడికి ముందు జ్యోతి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను ఐదు రోజుల పోలీస్ రిమాండ్లో ఉంచారు. ఈ క్రమంలో అధికారులు ఆమె ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్లను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
US-China: ట్రేడ్ వార్కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం
Stock Market: భారత్-పాక్ కాల్పుల విరమణ.. స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి