Baba Ramdev: పాకిస్థాన్తో యుద్ధం జరిగితే
ABN , Publish Date - May 06 , 2025 | 04:02 AM
పాకిస్థాన్ వ్యర్థదేశంగా మారిపోతుందని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే భారత్ కరాచీ, లాహోర్లలో గురుకులాలు స్థాపించే పరిస్థితి వస్తుందని అన్నారు

కరాచీ, లాహోర్లో మన గురుకులాలు: రాందేవ్
హమీర్పూర్, మే 5: పాకిస్థాన్ అంతర్గత కలహాలతో విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉందని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. బలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘యుద్ధం వస్తే భారత్ను వారు నాలుగు రోజులు కూడా ఎదుర్కోలేరు. కొన్ని రోజుల్లోనే మనం కరాచీలో ఒక గురుకులాన్ని, లాహోర్లో మరో గురుకులాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది’’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ తుడిచిపెట్టుకు పోతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..