Share News

Indrayani River Bridge: నదిపై వంతెన కూలి ఇద్దరు మృతి, పలువురి గల్లంతు

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:39 PM

ఆదివారం పూట విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర పూణే జిల్లాలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది.

Indrayani River Bridge: నదిపై వంతెన కూలి ఇద్దరు మృతి, పలువురి గల్లంతు
Indrayani River Bridge

మహారాష్ట్ర: గుజరాత్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే.. మహారాష్ట్ర పూణే జిల్లాలో మరో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన (Indrayani River Bridge) కుప్పకూలడంతో ప్రస్తుతం ఇద్దరు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన పూణే జిల్లాలోని కుందమల గ్రామ సమీపంలోని పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.


సండే కావడంతో

గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందువల్ల ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం కావడంతో ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఆ పాత వంతెన జనాల బరువు తట్టుకోలేక కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుండమల ఒక పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం ప్రమాదకరమని చెబుతారు. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది.


సహాయక చర్యలు

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పింప్రి-చించ్వాడ్ పోలీసులు, స్థానిక అధికారులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది.


సీఎం స్పందన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉంది. అదనంగా, వంతెన కూలిపోవడానికి గల కారణాలను లోతుగా విచారించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలోని పాత వంతెనల భద్రత, నిర్మాణ నాణ్యతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దుర్ఘటన రాష్ట్రంలోని ఇతర వంతెనల పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 08:06 PM