PM Modi: అహ్మదాబాద్ పర్యటనకు..
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:57 AM
Ahmedabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు వెళ్లనున్నారు.

New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు (Ahmedabad Visit) వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా (Amit Shah), పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అహ్మదాబాద్లో ఉన్నారు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు.
ప్రధాని మోదీ వెంట కేంద్ర, రాష్ట్ర మంత్రులు..
ప్రధాని మోదీ అహ్మదాబాద్ పర్యటనలో ఆయన వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్లు ఉండనున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేయడంతో సహాయక చర్యల వేగంగా జరుగుతున్నాయి. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఘటనా ప్రాంతం వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రధాని మోదీ ట్వీట్..
‘అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధపెట్టింది. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకం. ఈ విషాద సమయంలో తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని.. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు.. అధికారులతో నేను సంప్రదిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
తీవ్రంగా కలత చెందా..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..: పేర్ని నాని
For More AP News and Telugu News